--:-- | Today 28°C · Weather
Breaking

sonam వాంగచుక్ కు మద్దతుగా lic వద్ద గల బాబాసాహెబ్ విగ్రహం వద్ద సంఘీభావ కార్యక్రమం

Jul 18, 2026 6:50 42 views 11

Description

భీమ్ సేన ఆధ్వర్యంలో sonam వాంగచుక్ కు మద్దతుగా lic వద్ద గల బాబాసాహెబ్ విగ్రహం వద్ద సంఘీభావ కార్యక్రమం జరిగింది. భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ అవుతూ అనేకమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అలాగే ఈ యాడాది సీబీఎస్సీ పేపర్ కూడా OSM మోడల్ ఫలితంగా అనేక వేల మంది విద్యార్థులు నష్టపోయారని దీనిపై నిరసనగా లడక్ హీరో sonam చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటానికి భీమ్సేన విశాఖపట్నంలో ఆయనకు మద్దతు తెలపడం జరిగిందన్నారు. నీట్ పేపర్ లీక్ ఫలితంగా దేశంలో సుమారు ఇప్పుడు ఒక 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పేపర్ లీక్ అవ్వడం విద్యార్థులకు అత్యంత ఆందోళన గురిచేస్తుందని దీనిపై ఉద్యమం చేస్తున్నటువంటి సోనం యొక్క పోరాటాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని విద్యార్థుల్లోకానికి దేశానికి సరైన సంకేతాలు ఇచ్చేటట్లుగా దేశ ప్రజలకు మరింత నమ్మకం కలిగేటట్లుగా ప్రభుత్వం తన పాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్ సేన కేడర్, రాజ్యాంగ ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొన్నారు.

Related Videos

డ్రైవర్ల సంక్షేమానికి "యాట్రిక్స్ (Yatrix)" రైడ్ హైలింగ్ యాప్ ప్రారంభం ll VVw news
Jul 18, 2026

డ్రైవర్ల సంక్షేమానికి "యాట్రిక్స్ (Yatrix)" రైడ్ హైలింగ్ యాప్ ప్రారంభం ll VVw news

డ్రైవర్ల సంక్షేమానికి "యాట్రిక్స్ (Yatrix)" రైడ్ హైలింగ్ యాప్ ప్రారంభం ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న అనేక రైడ్ అగ్రిగేటర్ యాప్‌లు డ్రైవర్ల న…

Watch Now