--:-- | Today 28°C · Weather
Breaking

ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*ll VVW NEWS

Jul 20, 2026 6:24 4 views 1

Description

*ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే.... కార్పొరేట్ రాజధానిగా మార్చారు*

*అమరావతి భూములపై కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి షాక్*

*ల్యాండ్ పూలింగ్ పేరుతో మరో 50 వేల ఎకరాలు అడుగుతోందని...*

*ఇంతకు ముందు భూములు ఇచ్చిన రైతులకే ఇంకా న్యాయం జరగలేదని విమర్శించారు*

*ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం*

---- *తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్*

విజయవాడ: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ ఆరోపించారు. సోమవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాల్లో కలిసిపోయాయన్నారు. యువత, రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిచో ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. "నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, రైతు సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు" అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అమరావతి అంశంలో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. "చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 29 గ్రామాల ప్రజలు రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారిన తరువాత ఆ రైతులు నరకయాతన అనుభవించారు" అని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పేరుతో మరో 50 వేల ఎకరాలు అడుగుతోందని, ఇంతకు ముందు భూములు ఇచ్చిన రైతులకే ఇంకా న్యాయం జరగలేదని విమర్శించారు. "అమరావతిలో ఎయిర్‌పోర్ట్ కడతామని మాయమాటలు చెబుతున్నారు. గతంలో భూములు ఇచ్చిన వారికే ఏమీ లేనప్పుడు కొత్త కథలు ఎందుకు?" అని ప్రశ్నించారు. దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని, రేపు ఈ ప్రభుత్వం రాకపోతే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఒక పక్క ప్రజా రాజధాని అంటూనే దానిని కార్పొరేట్ రాజధానిగా మార్చారని ఆరోపించారు.

ప్రభుత్వంపై ఇతర ఆరోపణలు:

భూముల కేటాయింపు: విశాఖలో కారు చౌకగా భూములు ఇస్తున్నారు. అమరావతిలోనూ తమకు కావాల్సిన వారికి చౌకగా భూములు కట్టబెడుతున్నారు.

ఆర్థిక పరిస్థితి: గతంలో ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామన్న టీడీపీ నాయకులు, నేడు దీనిని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు.

లోకేష్ పర్యటనలు: మంత్రి లోకేష్ విదేశీ పర్యటనల పేరుతో పెట్టుబడులు తెస్తామనడం హాస్యాస్పదం. తన మానవ వనరులు, ఐటీ శాఖల్లోనే పట్టు సాధించలేని వ్యక్తి ఇతర మంత్రుల శాఖలపై దృష్టి పెడుతున్నారన్నారు.

విద్యాశాఖ: తమిళనాడులో విజయ్ విద్యా శాఖలో సంస్కరణలు తెస్తుంటే, ఇక్కడ మాత్రం కార్పొరేట్ సంస్థలకే విద్యాశాఖ మంత్రి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

మాదిగాని గురునాధం: గత ప్రభుత్వంలో మూడు రాజధానుల ఉద్యమం చేసిన మాదిగాని గురునాధం ఇప్పుడు టీడీపీలో చేరి మౌనంగా ఉన్నారన్నారు. చేతనైతే ముందు 52 వేల మందికి పట్టాలు ఇప్పించాలని సవాల్ విసిరారు.

ఎన్టీఆర్: ఎన్టీఆర్ రా ఆర్గనైజేషన్ తిరుపతిలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తామనడం మంచి పరిణామం. తప్పకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

Related Videos

తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి!#vvwnews #news #ysrcptrolls #latestnews
Jul 21, 2026

తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి!#vvwnews #news #ysrcptrolls #latestnews

అంగన్ వాడీలు.. చాకిరీకి తప్ప సంక్షేమానికి పనికిరారనేది జగన్ వంకరబుద్ధి! తల్లికి వందనంతో వారిని గౌరవించడం చంద్రబాబు గారి చిత్తశుద్ధి! #Tallik…

Watch Now
మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. ll #vvwnews #news #ytshorts
Jul 21, 2026

మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. ll #vvwnews #news #ytshorts

మాటల గారడీలు, ప్రజలను మోసం చేసే మాయల మరాఠీలు.. చేతిలో సాక్షి పత్రిక ఉంది కదాని.. అబద్ధాలు, విషప్రచారాలు కలిపి వండి వడ్డించడం.. ఈ పప్పులు ఉడి…

Watch Now
ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు  #vvwnews #news #ysrcptrolls #ytshorts
Jul 20, 2026

ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు #vvwnews #news #ysrcptrolls #ytshorts

ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మా దేవుడు బర్మా కాలనీ పై వైసీపీ దుస్ప్రచారం కూటమి సర్కార్ న్యాయం చేయాలి మురళి నగర్ (విశాఖ ఉత్తరం): బర్మా …

Watch Now
అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో  రాష్ట్ర సంఘం నిర్వహణలో  పెట్ సమావేశం   ll #vvwnews #news #ysrcptroll
Jul 20, 2026

అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నిర్వహణలో పెట్ సమావేశం ll #vvwnews #news #ysrcptroll

అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నిర్వహణలో పెట్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జ…

Watch Now