--:-- | Today 28°C · Weather
Breaking

మారికవలస గురుకుల పాఠశాల వివాదానికి తెర. యథావిధిగా చదువులుVVWNEWS

Sep 1, 2026 4:13 19 views 1

Description

మారికవలస గురుకుల పాఠశాల వివాదానికి తెర.

యథావిధిగా చదువులు.

మధురవాడ: మధురవాడ,మారికవలసలోని ఎస్టీ గురుకుల పాఠశాల తరలింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన సుఖాంతమైంది.భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్,గురుకుల సొసైటీ సెక్రటరీ మాధవిలు తల్లిదండ్రులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ఉద్దేశంతో విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించినప్పటికీ, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు పిల్లలను తిరిగి ఇక్కడే కొనసాగించేందుకు అధికారులు హామీ ఇచ్చారు.గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఇతర పాఠశాలలకు తరలించిన పిల్లలను తిరిగి మారికవలసలోనే చదివిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాలు, టాయిలెట్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి మాధవి వెల్లడించారు.
పిల్లలు ఇక్కడే చదువుకుంటారని తల్లిదండ్రులు జాయింట్ సెక్రటరీకి లేఖ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళన ముగిసింది.

Related Videos

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.
Sep 12, 2026

విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్.

*విశాఖ మేయర్ టికెట్ యాదవులకే కేటాయించాలి.. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ డిమాండ్..* మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ స్థానాన్ని రాబోయే ఎన్నికల్లో యాద…

Watch Now