--:-- | Today 28°C · Weather
Breaking

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి.అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌

Sep 17, 2026 7:35 1 views 1

Description

స్థల వివాదంలో బాధితురాలికి న్యాయం చేయాలి..అధికారిక సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి..సి.ఆర్.సి. డిమాండ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 17: హెచ్‌బీ కాలనీలో ఆర్‌ఐఎన్‌ఎల్ ఫేజ్‌-1 వేలం ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థల వివాదాన్ని పరిష్కరించి బాధితురాలు శైలజ ముసునూరుకు న్యాయం చేయాలని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ (సి.ఆర్.సి.) డిమాండ్ చేసింది. గురువారం డాబాగార్డెన్స్, ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి.ఆర్.సి. నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే మాట్లాడుతూ ఒకే రహదారికి సంబంధించి వేర్వేరు రిజిస్ట్రేషన్ పత్రాల్లో 24, 30 అడుగులుగా కొలతలు నమోదవడం వివాదానికి ప్రధాన కారణమన్నారు. జీ.వి.ఎం.సి. రికార్డులు, ఆర్‌ఐఎన్‌ఎల్ పత్రాలు, పొరుగున ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. వివాదాస్పద స్థలంపై స్వతంత్ర అధికారిక భౌతిక సర్వే నిర్వహించి 185.16 చదరపు గజాల స్థలానికి స్పష్టమైన హద్దులు నిర్ణయించాలని సి.ఆర్.సి. డిమాండ్ చేస్తుందని తెలిపారు. ప్రజా రహదారి లేదా ప్రభుత్వ భూమికి ఎలాంటి నష్టం కలగకుండా చట్టబద్ధమైన పరిష్కారం చూపాలని కోరారు. వేలం పత్రాల్లో పేర్కొన్న విధంగా స్థలాన్ని వినియోగించడం సాధ్యం కాకపోతే, నిబంధనల ప్రకారం సమాన విస్తీర్ణం, సమాన విలువ కలిగిన ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్‌ఐఎన్‌ఎల్ ఫేజ్‌-2 వేలం లేఅవుట్‌, రోడ్డు వెడల్పులు, ప్లాట్ హద్దులను ముందుగానే పూర్తిగా ధృవీకరించాలని కోరారు.
బాధితురాలు శైలజ మాట్లాడుతూ ఆర్‌ఐఎన్‌ఎల్ వేలం ద్వారా 185.16 చదరపు గజాల స్థలాన్ని సుమారు రూ.2 కోట్లకు కొనుగోలు చేశానని, ఇందుకోసం సుమారు రూ.1.60 కోట్ల గృహ రుణం తీసుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ ప్రారంభించగా, స్థలాన్ని నిర్మాణానికి సిద్ధం చేసే సమయంలో పొరుగున ఉన్న ఆస్తుల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు. సంబంధిత రహదారి 30 అడుగుల వెడల్పు ఉన్నట్లు వారి రిజిస్ట్రేషన్ పత్రాల్లో పేర్కొనగా, ఆర్‌ఐఎన్‌ఎల్ వేలం రిజిస్ట్రేషన్ పత్రాల్లో అదే రహదారి 24 అడుగులుగా నమోదై ఉందని తెలిపారు. రహదారి వెడల్పు, స్థల హద్దులను తేల్చేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్ అధికారులను పలుమార్లు అధికారిక భౌతిక సర్వే నిర్వహించాలని కోరినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సుమారు 20 నెలలుగా వివాదం కొనసాగుతుండటంతో ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని, గృహ రుణంపై నెలకు సుమారు రూ.1.40 లక్షల వడ్డీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సి.ఆర్.సి. విశాఖ జిల్లా అధ్యక్షులు శరత్ చంద్ర, స్టేట్ సెక్రటరీ విద్యాసాగర్, నేషనల్ స్పోక్స్‌పర్సన్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

Related Videos

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
Sep 17, 2026

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

*కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

Watch Now
మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం..
Sep 17, 2026

మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం..

మెరుగైన ఆరోగ్యానికి వ్యాయామం అవసరం టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభం.. ముఖ్యఅతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రతి ఒక్కరూ ఆరో…

Watch Now
విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ll VVw news
Sep 17, 2026

విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ll VVw news

విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి తూర్పు నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చాలి: వైఎస్సార్‌సీపీ జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్…

Watch Now