--:-- | Today 28°C · Weather
Breaking

యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం*

Sep 18, 2026 3:39 2 views 0

Description

*యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహం*

*ఉత్తరాంధ్ర యువతకు అపార ఉపాధి అవకాశాలు*

*జనసేన అధ్యక్షులు ..దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*తెలుగు ప్రజల అభిమానంతోనే సీరియల్స్ లో మంచి పేరు సంపాదించా.. బుల్లి తెర నటుడు బాలు*

విశాలాక్షినగర్, విశాఖపట్నం, సెప్టెంబరు 18:


రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని జనసేన పార్టీ విశాఖ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిశ్రమలకు రాయితీలు, సింగిల్‌ విండో విధానంలో అనుమతులు అందిస్తున్నట్లు తెలిపారు.

విశాలాక్షినగర్‌లో శుక్రవారం సీఎన్‌ఆర్‌ వెంచర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలు మరింత పెరిగాయని అన్నారు. ఫలితంగా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

భవిష్యత్తులో పర్యాటక, ఆతిథ్య, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖలో తాజాగా 16 హోటళ్లకు పర్యాటక శాఖ అనుమతులు జారీ చేసిందని తెలిపారు. భోగాపురం పరిసర ప్రాంతాలు రానున్న రోజుల్లో వేగంగా అభివృద్ధి చెంది సాటిలైట్‌ టౌన్‌షిప్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉందన్నారు.

*అభిమానుల ఆదరణే నా బలం*

ప్రముఖ సీరియల్‌ నటుడు బాలు మాట్లాడుతూ సీఎన్‌ఆర్‌ వెంచర్స్‌ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని, వారి ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని అన్నారు. భవిష్యత్తులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పటికీ మరువబోనన్నారు.

*సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం*

సీఎన్‌ఆర్‌ వెంచర్స్‌ అధినేతలు చెల్లుబోయిన రాము, చెల్లుబోయిన నర్సింగరావు.. చంటిలు
తొలుత వంశీకృష్ణ శ్రీనివాస్ ..నటుడు బాలును సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. తమ సంస్థల అభివృద్ధిలో ప్రజల ఆశీస్సులు, సహకారం కీలకమని వారు తెలిపారు. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని, పేదలకు తమ పరిధి మేరకు సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోట్ల రఘు.. అయ్యప్ప రెడ్డి.. ప్రసాద్ నాయుడు.. తదితరులు పాల్గొన్నారు.. బాలుతో
ఫోటోలు దిగేందుకు స్థానిక మహిళా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు

Related Videos

గత 15 సంవత్సరాల బట్టి ఈ గణేష్ మహోత్సవాలు జరుపుతున్నాము
Sep 18, 2026

గత 15 సంవత్సరాల బట్టి ఈ గణేష్ మహోత్సవాలు జరుపుతున్నాము

నమస్కారం అండి. మేము ఈ సంపత్ వినాయక సిటీ ఫుట్‌పాత్ చిల్లర వర్తక సంక్షేమ సంఘం సంఘ సభ్యులం మాట్లాడుతున్నాం. గత 15 సంవత్సరాల బట్టి ఈ గణేష్ మహోత్…

Watch Now
కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
Sep 17, 2026

కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ

*కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్ర అభివృద్ధి.. వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

Watch Now