--:-- | Today 28°C · Weather
Breaking

ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*

Jul 29, 2026 8:25 0 views 0

Description

*ఎంఈఎస్ కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి నేవీ చీఫ్ ఇంజనీర్ కు వినతి*

విశాఖ జిల్లా మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ (ఎంఈఎస్) కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఈఎస్ విశాఖ చీఫ్ ఇంజనీర్ పంకజ్ త్యాగీ కి వినపత్రము అందజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఈఎస్ బిల్డర్స్ సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు వినతి పత్రాలు అందజేశామని ఎంఈఎస్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ మెంబర్ సి.బాల సతీష్, విశాఖ బ్రాంచ్ చైర్మన్ గుజ్జు వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల సంఘం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లు, ఇబ్బందులు, సమస్యలను తెలియజేసేందుకు వినతిపత్రాన్ని అందజేశామన్నారు. ఈ క్లాస్ కాంట్రాక్టర్స్ టెండర్ లిమిట్స్ ను 50 లక్షలకు పెంచాలని కోరారు. యుద్ధం నేపథ్యంలో ధరలు బాగా పెరిగాయని దీని కనుగుణంగా కాంట్రాక్టర్లు పనులు నిర్వహించేందుకు వీలుగా ధరలను పెంచాలని అన్నారు. ఎంఈఎస్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించకపోతే, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనుగడకే తీవ్రమైన కాంట్రాక్టర్ వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిశీలన మరియు అవసరమైన చర్యల కోసం చీఫ్ ఇంజనీర్ కు వివరించామన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో సవరణ ఉన్నప్పటికీ, ఎన్‌లిస్టెడ్ కాంట్రాక్టర్ల అన్ని తరగతుల ఆర్థిక పరిమితులను 2010 తర్వాత పెంచకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బివిఎస్ సుబ్బరాజు, కోశాధికారి డిఈవి రామప్రసాద్ రెడ్డి, సభ్యులు సిహెచ్ సుదర్శన్, బి.యన్ రాజారెడ్డి పాల్గొన్నారు.

Related Videos

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
Jul 29, 2026

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

సీతంపేట శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే ఆలయంలో …

Watch Now
రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు
Jul 29, 2026

రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు

విశాఖ తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ, లో శిరిడి సాయిబాబా ధ్యాన మందిరం దగ్గర గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

Watch Now
ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి
Jul 29, 2026

ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి

* ప్రతి విద్యార్థీ ప్రకృతితో మమేకమై జీవించాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయ…

Watch Now
ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం
Jul 29, 2026

ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం

*ఇంటింటికీ యోగా, అందరికీ ఆరోగ్యం.. జ్యోతినగర్‌లో వైభవంగా గురు పౌర్ణమి యోగా మహోత్సవం..* యోగా అనేది కేవలం వ్యాయామం కాదు.. అదొక ఆరోగ్యకరమైన జీవ…

Watch Now